Viral Wedding: ముచ్చటగా ఒకేసారి ముగ్గురు అక్కాచెల్లెళ్లను పెళ్లాడిన యువకుడు.. ఎక్కడంటే?

Viral Wedding: ఈ రోజుల్లో ఒక్క పెళ్లాంతోనే ఏగలేక సగటు మొగుళ్లు తలలు పట్టుకుంటున్నారు.. కానీ.. ఉత్తరప్రదేశ్లోని అమ్రోహా జిల్లా ధోరియా గ్రామానికి చెందిన ఓ పుణ్యాత్ముడు ఏకంగా ముగ్గురు అక్కాచెల్లెళ్లను ఒకేసారి మనువాడి సోషల్ మీడియాలో రచ్చ లేపాడు! రమేష్ వృతి రీత్యా రైతు. పట్టీలైన సరోజ్, సావిత్రి, సంతోషలను చాముండా ఆలయ హవన్ వేదిక ముందు అగ్నిసాక్షిగా ఆ వీరుడి పెళ్లాడాడు. వాళ్ల మెడలో పూలమాలలు వేసి, ఏడడుగులు నడిచాడు. నవ వధువులు తమ భర్త పాదాలకు నమస్కరించారు. ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మొదటి వీడియో చూసి ఇదేదో ప్రాంక్ ఆర్టిస్టుల రచ్చలే అని నెటిజన్లు తేలిగ్గా తీసుకున్నారు. కానీ.. తాము చేసుకున్నది నిజమైన పెళ్లేనని నిర్ధారిస్తూ మరో రీల్ ద్వారా వాళ్లు క్లారిటీ ఇచ్చారు.
ఈ ఘటనతో పలు కొత్త వివాదాలు చోటుచేసుకున్నాయి. హసన్పూర్ మున్సిపల్ కార్పొరేషన్కు చెందిన బీజేపీ ఛైర్మన్ కూడా ఈ వీడియోలో దంపతులతో కలిసి కనిపించడం కలకలం రేపగా, ఛైర్మన్ ముగ్గురి పెళ్లికి హాజరుకావడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయితే, తమ ఆలయ ప్రాంగణంలో ఎలాంటి వివాహ వేడుక జరగలేదని చాముండా ఆలయ పూజారులు స్పష్టం చేశారు. ఈ పెళ్లిపై హిందూ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. సోషల్ మీడియాలో ఈ వివాహాలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొంతమంది సమర్థిస్తుండగా.. ఫాలోవర్లు దీనిని తీవ్రంగా తప్పుబడుతున్నారు. ఈ వివాదం పెద్దదవ్వడంతో ఆ ముగ్గురు సోదరీమణులు, ఆ యువకుడు ప్రస్తుతం మీడియా ముందుకు రావడానికి నిరాకరిస్తున్నారు. కాగా, ఇటీవలె ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఖాతాలు ప్రారంభించిన ఈ సోదరీమణులు కేవలం 27 వీడియోలతోనే లక్షలాది మంది ఫాలోవర్లను సంపాదించుకుని సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లుగా మారారు. ప్రస్తుతం ఈ సంచలనంపై ఇరు కుటుంబాల నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.