
PM Modi : ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ పర్యటన ఖరారైంది. మే 9వ తేదీన ఆయన రాష్ట్రానికి రానున్నారు. వరుసగా మూడోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మోడీ తెలంగాణకు రావడం ఇదే తొలిసారి కావడంతో, రాష్ట్ర బీజేపీ శ్రేణులు ఈ పర్యటనను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. పర్యటనలో భాగంగా ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని, కొత్త ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేయనున్నారు.
ప్రధాని రాకను పురస్కరించుకుని సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్స్లో భారీ బహిరంగ సభను నిర్వహించేందుకు పార్టీ నాయకత్వం ఏర్పాట్లు చేస్తోంది. లక్షలాది మంది ప్రజలను ఈ సభకు సమీకరించడం ద్వారా రాష్ట్రంలో పార్టీ బలాన్ని చాటాలని బీజేపీ భావిస్తోంది. ఈ పర్యటన అటు ప్రభుత్వ పరంగా అభివృద్ధి పనులకు, ఇటు రాజకీయంగా పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపడానికి కీలక చిహ్నంగా మారనుంది.