విశాఖ జంతు ప్రదర్శనశాలకు ప్రత్యేక అతిధి పలకరించింది. కాంతివంతమైన కళ్ళు, నల్లటి నిగనిగలాడే శరీరం, అమాంతంగా దూకేందుకు అవకాశం కోసం ఎదురుచూస్తున్నట్టు.. దాదాపు నాలుగు దశాబ్దాల విరామం తర్వాత.. అటువంటి అతిథి జూలో చేరింది. అదేనండి బ్లాక్ పాంథర్. నల్ల చిరుత..
విశాఖలో ఆ ప్రత్యేక అతిధిని చూసేందుకు తరలివస్తున్నారు. నాలుగేళ్ల వయసుగల ఈ ఆడ నల్ల చిరుతను.. గౌహతిలోని అస్సాం స్టేట్ జూ కం బొటానికల్ గార్డెన్ నుంచి తీసుకొచ్చారు. యానిమల్ ఎక్స్చేంజ్ ప్రోగ్రాం లో భాగంగా.. ఈ బ్లాక్ పాంథర్ విశాఖ జూకు వచ్చింది. ఈ జంతువును ఘోస్ట్ ఆఫ్ జంగిల్ గా పిలుస్తున్నారు
భారతదేశంలో జంతు ప్రదర్శన మధ్య జరిగే జంతు మార్పిడి పద్ధతి అనేది జంతువుల సంరక్షణ, సంతనోత్పత్తి, జన్యు వైవిధ్యాన్ని కాపాడేందుకు ఉపయోగించి ఒక శాస్త్రీయ విధానం. ఈ ప్రక్రియ సెంట్రల్ జూ అథారిటీ పర్యవేక్షణ జరుగుతుంది.
విశాఖకు తీసుకొచ్చిన తర్వాత ఈ బ్లాక్ పాంథర్ ను నెలన్నర పాటు క్వారంటైన్ లో ఉంచారు. నల్ల చిరుత ఆరోగ్యంగా ఉందని నిర్ధారించుకున్న తర్వాత.. ఎన్ క్లోజర్ లో అధికారికంగా పిసిసిఎఫ్ చలపతిరావు సమక్షంలో విడిచిపెట్టారు. సందర్శకులకు అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ కొత్త అతిధిని చూసేందుకు జనం క్యూ కడుతున్నారు.
ఈ నల్ల చిరుత పేరు రెజీమా.. నిపుణులైన సిబ్బందిని దీని సంరక్షణ కోసం ఉంచారు. బ్లాక్ పాంథర్ డైట్ ప్రత్యేకంగా ఉంటుంది. దీనికి ప్రతిరోజు ఉదయం ఒక కిలో చికెన్ పెడతారు. మధ్యాహ్నం.. రెండు నుంచి మూడు కిలోల వరకు బీఫ్ ఆహారంగా వేస్తామని జూక్యూరేటర్ మంగమ్మ తెలిపారు.




