Reading Time: 2 minutes
Us Defense Secretary Pete Hegseth Warns Iran

ఇరాన్ దగ్గర అణ్వాయుధాలు లేకుండా చేయడమే తమ లక్ష్యం అని అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సేత్ ప్రకటించారు. తాజా పరిణామాలపై పీట్ హెగ్సేత్ మీడియాతో మాట్లాడారు. ‘‘యుద్ధాన్ని మేం ప్రారంభించలేదు.. కానీ యుద్ధాన్ని మేం ముగిస్తాం. చర్చలకు రావాలని ఇరాన్‌ను అనేక సార్లు కోరాం. కానీ మాట వినలేదు. మేం శత్రువులను జయిస్తాం. ట్రంప్‌ అమెరికన్లకు మొదటి స్థానం ఇస్తారు. ఈ యుద్ధం కోసం నిబంధనలు సెట్‌ చేశాం. మేమే ట్రంప్ నాయకత్వంలో యుద్ధాన్ని పూర్తి చేస్తాం’’ అని పీట్ హెగ్సేత్ స్పష్టం చేశారు.

‘‘ఇకపై ఇరాన్ దగ్గర ఎప్పటికీ అణ్వాయుధాలు ఉండవు. శస్త్ర చికిత్స ద్వారా అత్యధిక స్థాయిలో.. క్షమాపణ లేకుండా దాడి చేస్తాం. గడిచేకొద్దీ మా సామర్థ్యాలు బలపడతాయి. కచ్చితంగా ఇరాన్ బలహీనపడుతుంది. 47 సంవత్సరాలుగా టెహ్రాన్‌లోని ఇస్లామిక్ ప్రభుత్వం అమెరికాపై ప్రమాదకరమైన, ఏకపక్ష యుద్ధం చేసింది. అమెరికాను ఓడించండి, ఇజ్రాయెల్‌ను ఓడించండి అని నినాదాలు చేసిన పాలన చివరకు అమెరికా, ఇజ్రాయెల్ చేతుల్లో అంతం చూస్తుంది. ఇరాన్ ప్రజలు ఈ అద్భుతమైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నాం.’’ అని వ్యాఖ్యానించారు.

‘‘వారు మా ప్రజలను చంపారు. బీరూట్‌లో కారు బాంబు పేలుళ్లు చేశారు. మా నౌకలపై రాకెట్ దాడులు చేశారు. మా రాయబార కార్యాలయాల్లో హత్యలు చేశారు. ఇరాక్, ఆఫ్ఘనిస్థాన్‌ల్లో బాంబు దాడులు చేశారు. మీరు అమెరికన్లను చంపితే.. ప్రపంచంలో ఎక్కడైనా అమెరికన్లను బెదిరిస్తే.. మేము మిమ్మల్ని వెంబడించి క్షమాపణ లేకుండా.. సంకోచించకుండా చంపేస్తాం.’’ పీట్ హెగ్సేత్ వార్నింగ్ ఇచ్చారు.