Reading Time: < 1 minute

‘కోర్ట్’ చిత్రంలో హర్ష్ రోషన్, శ్రీదేవీ తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు. మళ్లీ ఇప్పుడు వీరిద్దరూ కలిసి ‘బ్యాండ్ మేళం’ అంటూ ఆడియెన్స్ ముందుకు రాబోతోన్నారు. బ్లాక్ బస్టర్ రచయిత కోన వెంకట్ నిర్మాణ సారథ్యంలో ఈ చిత్రం రూపుదిద్దుకుంది. మ్యాంగో మాస్ మీడియా సమర్పణలో కోన ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్ మీద కావ్య, శ్రావ్య ఈ మూవీని నిర్మించారు. సతీశ్ జవ్వాజీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాని మార్చి 13న రిలీజ్ చేయబోతోన్నారు. ‘బ్యాండ్ మేళం’ టీజర్, ‘తిప్పూ కుంటానవ్’ అనే పాట ఎంతగా వైరల్ అయ్యాయో అందరికీ తెలిసిందే. ఇక ఇప్పుడు ఈ మూవీ నుంచి రెండో పాటను విడుదల చేశారు. ‘పల్లెలోని సందల్లన్ని మీవే’ అంటూ సాగే మెలోడీ పాటను మాస్ మహారాజా రవితేజ సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేశారు. పాటను రిలీజ్ చేసిన అనంతరం రవితేజ ‘బ్యాండ్ మేళం’ టీంకి బెస్ట్ విషెస్‌ను తెలియజేశారు. ఈ సినిమాను మార్చి 13న భారీ ఎత్తున విడుదల చేయబోతోన్నారు.