Reading Time: < 1 minute
IND vs NZ: టీమిండియా ఊహించని షాక్.. గాయంతో దూరమైన నలుగురు.. సిరీస్ నుంచి ఔట్?

India vs New Zealand: న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లోని మొదటి మ్యాచ్‌లో భారత క్రికెట్ జట్టు అద్భుతమైన విజయాన్ని నమోదు చేసింది. విరాట్ కోహ్లీ, శుభ్‌మాన్ గిల్, శ్రేయాస్ అయ్యర్‌ల అద్భుతమైన ఇన్నింగ్స్‌లు జట్టును విజయపథంలో నడిపించాయి. ఇంతలో, టీమ్ ఇండియా గాయాల సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. నలుగురు కీలక ఆటగాళ్ళు గాయాలతో బాధపడుతున్నారు. వారిలో ముగ్గురు న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే, టీ20 సిరీస్‌లలో భాగంగా ఉండగా, ఒకరు విజయ్ హజారే ట్రోఫీలో ఆడుతున్నారు. గత నాలుగు రోజుల్లో గాయపడిన నలుగురు కీలక ఆటగాళ్లను ఓసారి పరిశీలిద్దాం.

వాషింగ్టన్ సుందర్ ఔట్..

న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డేలో టీం ఇండియా ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ గాయపడ్డాడు. అతనికి సైడ్ స్ట్రెయిన్ వచ్చింది. అంటే, అతను మిగిలిన రెండు మ్యాచ్‌లలో ఆడలేడు. టీం ఇండియాలో అతని స్థానంలో ఆయుష్ బధోనిని ఎంపిక చేసింది.

రిషబ్ పంత్ ఔట్..

న్యూజిలాండ్‌తో జరిగే వన్డే సిరీస్‌కు టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ కూడా దూరమయ్యాడు. శుక్రవారం ప్రాక్టీస్ సమయంలో అతనికి గాయం అయింది. పంత్ నడుము పైన బంతి తగిలింది. అతని స్థానంలో ధ్రువ్ జురెల్‌ను ఎంపిక చేశారు.

తిలక్ వర్మ కూడా..

ఎడమచేతి వాటం బ్యాట్స్‌మన్ తిలక్ వర్మ కూడా గాయపడ్డాడు. విజయ్ హజారే ట్రోఫీ సందర్భంగా అతనికి గాయం అయింది. అతనికి పొత్తి కడుపు నొప్పి వచ్చింది. శస్త్రచికిత్స అవసరం అయింది. ఈ శస్త్రచికిత్స కారణంగా, అతను న్యూజిలాండ్‌తో జరిగే మొదటి మూడు టీ20 మ్యాచ్‌లకు దూరమయ్యాడు.

సర్ఫరాజ్ ఖాన్ వేలికి గాయం..

విజయ్ హజారే ట్రోఫీ సమయంలో సర్ఫరాజ్ ఖాన్ కూడా గాయపడ్డాడు. అతని వేలు విరిగింది. బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌కు పంపించారు. ఈ గాయం కారణంగా అతను విజయ్ హజారే ట్రోఫీ క్వార్టర్ ఫైనల్స్‌కు కూడా దూరమయ్యాడు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..