Reading Time: < 1 minute

నేషనల్ కిక్ బాక్సింగ్ పోటీల్లో అంబేద్కర్ కాలేజీ విద్యార్థినికి కాంస్య పతకం

Caption of Image.

ముషీరాబాద్, వెలుగు: కిక్ బాక్సింగ్ నేషనల్ చాంపియన్​షిప్‎లో డాక్టర్ బీఆర్.అంబేద్కర్ కాలేజీ విద్యార్థిని హరిప్రియ కాంస్య పతకం​సాధించింది. ఇటీవల ఒడిశాలో జరిగిన అండర్–19 పోటీల్లో పాల్గొని ప్రతిభ కనబరిచింది. శనివారం కళాశాల కరస్పాండెంట్ డాక్టర్ జి.సరోజా వివేక్ ఆమెను అభినందించి, సన్మానించారు. హరిప్రియ విజయం కళాశాలకు గర్వకారణమని, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. 

హరిప్రియ మాట్లాడుతూ.. జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని పతకం సాధించడానికి తనకు అన్నివిధాలా సహకరించిన అంబేద్కర్ ఇన్​స్టిట్యూట్ మేనేజ్​మెంట్ కు, ముఖ్యంగా కరస్పాండెంట్​సరోజా వివేక్ కు కృతజ్ఞతలు తెలిపింది. విద్యతోపాటు క్రీడలకు సమాన ప్రాధాన్యత ఇచ్చే ఇలాంటి విద్యాసంస్థలో చదవడం సంతోషంగా ఉందని పేర్కొంది. కార్యక్రమంలో ఇన్​స్టిట్యూట్ సీఈవో ప్రొఫెసర్ లింబాద్రి, అడ్మిన్ ఆఫీసర్ కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. 

©️ VIL Media Pvt Ltd.